TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

8వ రోజుకు చేరిన ఎయిరిండియా పైలెట్ల సమ్మె

Published on: Tue May 15, 2012 9:40AM

ఎయిరిండియా పైలెట్ల సమ్మె మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కోర్టు ఆదేశించినా సమ్మె కొనసాగిస్తున్నందున, ముందుగా సమ్మె విరమించి విధులకు హాజరయితే గానీ వారితో చర్చించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమ్మె కారణంగా 14 అంతర్జాతీయ విమాన సేవలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెల 17వరకు అమెరికా, యూరప్ లకు బుకింగ్ లు నిలిపివేశారు. పైలెట్ల సమ్మె వల్ల ఎయిరిండియాకు నిత్యం 26కోట్ల నష్టం వస్తుంది. తమ డిమాండ్లను తీర్చే వరకు సమ్మె విరమించేందుకు పైలెట్లు సిద్ధంగా లేరు. కోర్టు ఆదేశించినా సమ్మె కొనసాగిస్తున్నందుకు ఢిల్లీ హైకోర్టు పైలెట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.