మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు ఖాయం: కామినేని

 

విజయవాడ, గుంటూరు మధ్యలో వున్న మంగళగిరిలో ఆల్ ఇండియా మెడికల్స్ సైన్సెస్‌ను ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అలాగే కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. తిరుపతిలోని స్విమ్స్.ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నామని మంత్రి తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలకు 150 సీట్లు మంజూరు చేశామని, వీటిని ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు.