అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ లో ట్విస్ట్.. అరెస్ట్ చేయకుండా ఉంటే నిజం చెబుతా..

 

గత కొద్ది రోజుల క్రిందట అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. మరోవైపు దీనిని సంబంధించిన విచారణ ఇంకా జరగుతూనే ఉంది. దీనిలో భాగంగానే మాజీ వాయుసేన చీఫ్ ఎస్పీని సీబీఐ విచారిస్తుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈకేసు మరో కీలక మలుపు తిరిగింది. తనను కనుక అరెస్ట్ చేయకుండా ఉంటే.. ఇండియాకు వచ్చి విచారణకు సహకరించేందుకు అభ్యంతరం లేదని.. మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైఖేల్ సీబీఐకి తెలిపారు. తనపై ఉన్న ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకోవాలని, భారత అధికారులను దుబాయ్ లో కలిసి సాక్ష్యమిచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. ఆగస్టు 25వ తేదీతో మైఖేల్ జేమ్స్ లేఖను రాస్తూ, దుబాయ్ లోని భారత కాన్సులేట్ కు సీబీఐ అధికారులు వస్తే, తాను వారి ముందు నిలుస్తానని చెప్పడం గమనార్హం. ఈ కేసులో తాను అమాయకుడినని, కొంత సమాచారం మాత్రమే తనకు తెలుసునని ఆయన అన్నారు. మరి క్రిస్టియన్ జేమ్స్ ను విచారిస్తే ఎన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.