అద్వానికి బిగుస్తున్న ఉచ్చు...

 


బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానికి ఉచ్చు మరింత బిగుస్తున్నట్టు ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నేపథ్యంలో ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఈకేసు విచారించిన సుప్రీంకోర్టు అద్వానీతో పాటు మరికొంత మందిని విచారణ చేయాల్సిందిగా ఆదేశించగా.. సీబీఐ కోర్టు మే 30న తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అద్వానితో పాటు...మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలను కూడా అదే రోజున కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో వీరికి ఎలాంటి మినహాయింపును ఇవ్వలేమని స్పష్టం చేసింది.