ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి
Published on: Sun Jul 20, 2025 5:09PM

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దాడిలో 13 మంది అటవీ అధికారులు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు.


