శ్వేతా బసు: కొత్త వ్యభిచార లోకం...!

 

‘కొత్త బంగారు లోకం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన శ్వేతా బసు ప్రసాద్ తన మొదటి సినిమానే పెద్ద విజయం సాధించడంతో ఆమె సినిమా కెరీర్ ‘కొత్త బంగారు లోకం’లో అద్భుతంగా వుంటుందని అందరూ భావించారు. ఆ తర్వాత ఆమె తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాలలో కూడా హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా బిజీగా వున్న సమయంలో పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేసేదని వినికిడి. ఆ తర్వాత ఆమెకు సరైన హిట్లు లేకపోవడం వల్ల అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో ఆమె తనకు ‘కొత్త బంగారు లోకం’ ఇచ్చిన హైదరాబాద్‌లోనే కొత్త వ్యభిరాచార లోకాన్ని సృష్టించుకుంది. హైదరాబాద్‌లోని రాజ్ భవన్ పక్కనే వున్న ఒక హోటల్‌లో శ్వేతా బసు ప్రసాద్ చాలాకాలంగా తన ‘దందా’ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా జనాల్లో తనకు గుర్తింపు, తన శరీరంలో తళుకు బెళుకులు వుండగానే నాలుగు డబ్బులు వెనుక వేసుకోవాలన్న ఉద్దేశంతో శ్వేతా బసు ప్రసాద్ తన వ్యభిచార వ్యాపారాన్ని చాలా ఉద్ధృతంగా నిర్వహించినట్టు తెలుస్తోంది.