కోనసీమ వాసులకు కంగారెక్కువ: సునీల్ కామెంట్!!

 

రాజకీయ నాయకులు ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాకి అనుకూలంగా మాట్లాడ్డం రాజకీయ నాయకులకు అలవాటు. ఈ అలవాటు సినిమావాళ్ళకి కూడా వచ్చినట్టుంది. కమెడియన్ వేషాల నుంచి హీరో వేషాలకు ‘ఎదిగిన’ సునీల్ ఇప్పుడిప్పుడే ఈ అలవాటును నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. హోమియో పితామహుడు హానిమన్ విగ్రహ ఆవిష్కరణ కోసం కర్నూలు జిల్లాకి వెళ్ళిన సునీల్ అక్కడ తాను వెళ్ళిన పనేదో చేసుకుని రాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకి వెళ్ళిన ఆనందంలో, జనానికి ఉత్సాహం పుట్టించాలన్న అత్యుత్సాహంలో కోనసీమను కించపరిచేలా మాట్లాడారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో సునీల్ మాట్లాడుతూ, ‘‘కోనసీమ వాసులకు కంగారెక్కువ.. రాయలసీమ వాసులకు ధైర్యమెక్కువ’’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ విని రాయలసీమ వాసులు ఆనందంతో పొంగిపోయారో లేదోగానీ, కోనసీమ వాసులు మాత్రం కయ్యిమంటున్నారు. తమకు కంగారెక్కువ అని అనడానికి సునీల్ దగ్గర వున్న ఆధారాలేంటని ప్రశ్నిస్తున్నారు. సునీల్ ఈసారి కోనసీమకు వచ్చినప్పుడు కోనసీమకు కంగారు ఎంత ఎక్కువో సునీల్‌కి చూపిస్తామని అంటున్నారు. సునీలూ.. ఇరుక్కుపోయావయ్యా!!