చంద్రబాబుని ఎన్‌కౌంటర్‌ చేయండి: శివాజీ

 

కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో కడిగేస్తూ విమర్శలు చేసే నటుడు, ప్రత్యేకహోదా ఉద్యమ నేత శివాజీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. 'మీ టార్గెట్‌ చంద్రబాబు. దానికోసం రాష్ట్ర ప్రజలను హింసించే బదులు ఆయన్ను ఒకేసారి ఎన్‌కౌంటర్‌ చేయండి. చంద్రబాబుపై కోపంతో ఆంధ్ర ప్రజలకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు?’ అని నిలదీశారు. నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న తెలంగాణలో రేవంత్‌రెడ్డి, తాజాగా రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడానికి వెనుక ఒక వ్యక్తి చక్రం తిప్పాడని ఆరోపించారు. ఆ ఒక్కడే మొత్తం సమాచారాన్ని ఐటీ అధికారులకు ఇచ్చారన్నా రు. దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్‌ కుంభకోణాన్ని దారిమళ్లించడానికే ఐటీ దాడులు చేయిస్తున్నారన్నా రు. ఎవరు ఊరుకున్నా ఈ విషయంలో మాత్రం తాను మౌనం వహించే ప్రసక్తి లేదని చెప్పారు. ర్యాలీ నిర్వహించి ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేస్తానన్నా రు. ప్రత్యేకహోదా సాధన కోసం హోదా సైన్యాన్ని తయారు చేస్తున్నానని తెలిపారు. నవంబరు 2న ఈ సైన్యంతో రాష్ట్ర రహదారులపై ఆందోళనలు నిర్వహిస్తానన్నారు.