మోహన్ బాబుని కలిసిన వై.ఎస్ జగన్
Published on: Mon Apr 30, 2012 10:47AM
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలవడం సర్వత్రా చర్చాంశనీయమయింది.జగన్ కు చుట్టం అయిన వెరోనికాను మోహన్ బాబు తనయుడు విష్ణు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆమె ఈ మధ్యనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ భేటీపై మోహన్ బాబు స్పందిస్తూ తాము ఎటువంటి రాజకీయ చర్చలూ జరపలేదని వివరించారు.ఈ మధ్యనే మోహన్ బాబు మళ్ళీ రాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించడం తరువాత జరిగిన ఈ భేటీపై అందరూ అనేక ఊహాగానాలు చేస్తున్నారు.


