TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మార్పీ దాటితే చర్య తప్పదు : చంద్రబాబు 

Published on: Tue Oct 29, 2024 4:30PM

గత వైసీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ ప్రజలకు విక్రయించి దోచుకున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం నూతన పాలసీ రూపొందించింది. దీంతో ఎపి ప్రజలు చీప్ లిక్కర్ నుంచి బయటపడ్డారు. సరసమైన ధరలకు మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మార్పీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించినా, ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయాలు జరిగితే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ఎక్సైజ్ అధికారులతో చంద్రబాబు రివ్యూ చేశారు.