బీజేపీ అంటే కొత్త అర్దం చెప్పారుగా..

 

పట్టిసీమ ప్రాజెక్టు చర్చపై ఈరోజు అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. పట్టిసీమ ప్రాజెక్ట్  పై బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య వాగ్యాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... మొన్నటి దాకా మౌనంగా ఉండి... ఇప్పుడు ఉన్నట్టుండి సిట్టింగ్ జడ్జితో విచారణ, సీబీఐతో ఎంక్వైరీ అనే డిమాండ్లు చేస్తున్నారంటే... మీ మైండ్ లో ఎలాంటి కుట్ర ఉందో స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఓ ప్లాన్ ప్రకారం బీజేపీ ఈ పని చేస్తోందని... బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అంటూ బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. ఈ బీ.జే.పీలు ప్లాన్ ప్రకారం ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.