ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. దీని పై పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ నెల 27 న అధికారికంగా పార్టీ అధినేత ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి నేపథ్యంలో పార్ట్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు, లోకేష్ లు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో పార్టీలోని అన్ని విభాగాలలో కూడా మార్పులు చేసి యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్న జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని.. ప్రజల తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్నందుకే కేసులు బనాయించారని టీడీపీ చెపుతున్న విషయం తెలిసిందే.