జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ తో రహస్య మంతనాలు

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాసరావుకు వైరల్ ఫీవర్ మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 22వ తేదీన శ్రీనివాసరావును జైలు నుండి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండ్ టి. రమేష్ కిషోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ చికిత్స అందించారు. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైద్యులు తేల్చి చెప్పారు.

కాగా, శ్రీనివాసరావును జైలు నుండి ఆసుపత్రికి తరలించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలుసుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. జైలులో ఎవరూ కలిసినా కూడ ఆ వివరాలు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో కలిసేందుకు వీలుగా అనారోగ్యాన్ని కారణంగా చూపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.