రెండు ప్రమాదాలు.. ఇద్దరు విద్యార్థులు..

 

తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బి.వెంకటాయపాలెం వద్ద కారు ఢీకొనడంతో స్థానిక బీసీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న మన్నం సాయి అనే విద్యార్థి మరణించాడు. విద్యార్థి రోడ్డు దాటుతూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నందిత అనే నాలుగు సంవత్సరాల విద్యార్థిని స్కూలు బస్సు నుంచి కిందకి దిగి, అదే బస్సు కింద పడి మరణించింది. విద్యార్థిని మరణానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. స్థానికులు ఆగ్రహంతో స్కూలు బస్సును ధ్వంసం చేశారు.