అసెంబ్లీలో ప్రమాదం.. టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పిన గండం...

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. మంగళవారం జీరో అవర్లో టీడీపీ ఎమ్మెల్యే కొమ్ములపాటి శ్రీధర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి కర్టెన్ ఇనుప రాడ్ జారి పడింది. రాడ్ ఎమ్మెల్యేలకు కొద్ది దూరంలో పడటంతో ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు శాసనసభ్యులు కంగారుపడ్డారు. అనంతరం మార్షల్స్ ఆ ఇనుపరాడ్ను తొలగించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవడానికి కేటాయించిన హాలులో సదుపాయాలు సరిగా లేవని గతంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.