కెటీఆర్ ఇంట్లో ఎసిబి సోదాలు
Published on: Mon Jan 6, 2025 4:33PM
ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ హజరైవెనుదిరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉదయం ఎసిబి ఆఫీసు గేటు ముందు వరకు వెళ్లిన కెటీఆర్ ఎసిబి ఆఫీసులోకి ఎంటర్ కాలేదు. తన న్యాయవాదులను వెంట బెట్టుకుని లోపలికి వస్తానని మొరాయించడంతో ఎసిబి అధికారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కెటీఆర్ చేసిన ప్రకటన సాయంత్రం వరకు నిజమైంది. కెటీఆర్ కు స్పష్టమైన సమాచారం ఉండడంతో నా ఇంట్లో ఎసిబి సోదా చేస్తుందని ప్రకటన చేశారు. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కెటీఆర్ ఎ వన్ నిందితుడు. ఇదే కేసులో ఐఏఎస్ అధికారులైన బిఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లు కూడా నిందితులుగా ఉన్నారు.


