రిపబ్లిక్ డే ముఖ్య అతిధి...అబుదాబి ప్రిన్స్ కు ప్రధాని స్వాగతం

 

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు (68వ గణతంత్ర వేడుకలు) అబుదాబి ప్రిన్స్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు నహ్యాన్‌కు ఆహ్వానం పలికారు.