రాధాకృష్ణకు కోర్టులో చుక్కెదురు... నాన్ బెయిలబుల్ వారెంట్..

 

ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. అయితే కోర్టులో రాధాకృష్ణకు కోర్టులో చుక్కెదురైంది.  వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పరువు నష్టం కేసులో పదేపదే కోర్టుకు గైర్హాజరు అవుతున్నందుకు గాను.. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ లో పలు కథనాలు ప్రచురించారు. దాంతో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాసిందని పరువు నష్టం కేసు దాఖలు చేయగా...దానిపై విచారణ జరిపింది కోర్టు. రాధాకృష్ణ వరుసగా కోర్టుకు గైర్హాజరు అవుతుండటంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురు నిందితులు ఉండగా, వారంతా కోర్టుకు రావడంతో ఒక్కొక్కరూ రూ. 10 వేల పూచీకత్తును చెల్లించాలని కోర్టు ఆదేశించింది.