భారత్ లో కరోనా విశ్వరూపం.. కాంగ్రెస్ సీనియర్ నేతకు పాజిటివ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సింఘ్వి తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మరోవైపు, ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన ఇతర కాంగ్రెస్ నేతలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. టెస్టులు గడచిన 24 గంటల్లో ఏకంగా 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 17,296 పాజిటివ్ కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4,90,401 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301 కి చేరింది.