కడప పెద్ద దర్గాలో అభిషేక్ బచ్చన్ ప్రార్ధనలు
Published on: Mon Apr 9, 2012 3:49PM
అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కడపలో అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. అమీన్ పీర్ దర్గాలో ప్రార్ధనలు చేయించడానికి అభిషేక్ బచ్చన్ ఈ రోజు కడపకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి కడప అమీన్ పీర్ దర్గాను చేరుకోగానే దర్గా పెద్దలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అభిషేక్ బచ్చన్ అమీన్ పీర్ దర్గా పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ దర్గాకు రావడం చాల సంతోషంగా ఉంది, త్వరలోనే ఐశ్వర్య , పాపను తీసుకోని మళ్ళి దర్గాకు వస్తానని అన్నారు.


