ప్రజల చేతికే 'చీపురు'

 

 

 

ఢిల్లీ గద్దెపై చీపురు ఎక్కుతుందో లేదో అనేది ఇప్పుడు ప్రజల చేతిలోకి వెళ్ళింది. తాము ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ప్రజలను అడిగి నిర్ణయిస్తామంటూ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆమ్ఆద్మీ పార్టీ ఆ పనిలో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ శాసన సభ్యుల,కార్యకర్తలు వార్డులు వారీగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5.50లక్షల మంది అభిప్రాయాలు సేకరించమని, మరో రెండురోజుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేసి సోమవారం నాటికల్లా ప్రజాభిప్రాయం ప్రపంచానికి వెల్లడిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సో...సోమవారం దాకా వేచి చూద్దాం.