TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫార్ములా ఈ కార్ రేసులో  కెటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేసు 

Published on: Thu Dec 19, 2024 4:56PM

తెలంగాణలో మరో సంచలనం జరిగింది. ఫార్ములా ఈ కార్  రేస్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పై కేసు నమోదయ్యింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఎసిబికి  రాసిన లేఖ ప్రకారం ఎసిబి కేసు నమోదు చేసింది. ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. ఎ1 గా కెటీఆర్, ఎ 2గా అరవింద్  కుమార్ , ఎ 3గా బిఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.  గత కొంతకాలంగా  కెటీఆర్ అరెస్ట్ అనే వార్తలు గుప్పు మంటున్నాయి. తాజాగా కేబినెట్ భేటీలో ఫార్ములా ఈ  కార్ రేస్ లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విదేశాల్లో ఉన్న కంపెనీకి నిబంధనలను ఉల్లంఘించి నిధులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ప్రభుత్వం అభియోగాలు మోపింది. కెటీఆర్ పై నాలుగు సెక్షన్ల క్రింద కేసులు నమోదుచేశారు. ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలపడంతో కెటీఆర్ పై కేసు నమోదయ్యింది