వంశీకి భారీషాక్
Published on: Tue Mar 11, 2025 4:16PM
టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ కి భారీ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను ఎస్సి ఎస్టి కోర్టు మరోసారి పొడిగించింది. వంశీని వర్చువల్ గా జైలు అధికారులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీని ఎపి పోలీసులు గత నెలలో హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


