జమ్మూలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు..8 మంది జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. పుల్వామా జిల్లాలోని పాంపోర్‌కు సమీపంలో సీఆర్‌పీఎఫ్ బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మృత్యువాత పడగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని ఉన్నతాధికారులు తెలిపారు. తప్పించుకున్న వారి కోసం ఆర్మీ, పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.