దుబాయ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది భారతీయులు మృతి

 

దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులతో సహా మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఒమన్‌ నుంచి దుబాయ్‌కి 31 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టింది.

కాగా.. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. భారత్‌కు చెందిన రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరన్‌ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరికొందరు భారతీయులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని భారత్‌ ఎంబసీ తెలిపింది.