ఘోర అగ్ని ప్రమాదం.. 69 మంది మృతి

 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చాక్‌బజార్‌లోని అపార్టుమెంటులో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అపార్టుమెంటులో కెమికల్‌ వేర్‌హౌజ్‌ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న మరో 5 అపార్టుమెంట్లకు కూడా మంటలు రాజుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో  69మంది సజీవ దహనమయ్యారు. మరో 50మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అర్థరాత్రి నుంచి మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బంగ్లా ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. అంతే కాకుండా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉందని.. సహాయ చర్యలకు బాగా ఆటంకం కలిగిందని.... మంటల ధాటికి వారు కూడా గాయాలపాలయ్యారని తెలిపారు. భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.