చిన్నారిపై అత్యాచారం.. అవయవాల్లో చెక్కముక్కలు

హర్యానాలో దారుణం జరిగింది. ఆరేళ్ల పాపపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ అత్యంత పాశవికంగా మర్మావయవాల్లో చెక్క ముక్కలు చొప్పించడంతో ఆ బాలిక దుర్మరణం పాలైంది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన హిసార్‌లో జరిగింది. తల్లి, సోదరితో కలిసి నిద్రపోతున్న చిన్నారిని అపహరించిన దుండగులు తమ కామవాంఛ తీర్చుకుని అనంతరం పాపను వదిలివేశారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు పాపను పోస్ట్‌మార్టానికి పంపించడంతో ఆ మృగాళ్లు ఎంత దారుణంగా ప్రవర్తించారో వెలుగులోకి వచ్చింది. చిన్నారి అంతర్గత భాగాల్లో దుండగులు చెక్క ముక్కలు చొప్పించడంతో.. పేగులు, శరీరంలోని ఇతర భాగాలు ఛిద్రమయ్యాయి. చిన్నారి భుజాలు, చేతులు, ముఖం మీద తీవ్రమైన గాయాలున్నాయి. వీటి కారణంగా పాప మరణించిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో హిసార్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పసిబిడ్డ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించిన వాళ్లని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.