58 ఎమ్మెల్సీ స్థానాలు కోరనున్నాం: యనమల

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో వున్న లోపాల గురించి కూడా కేంద్ర హోం శాఖకు ఒక లేఖ రాయబోతున్నట్టు ఆయన చెప్పారు. ఈ అంశంమీద ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించామని, వారి సూచన మేరకే కేంద్ర హోం శాఖకు లేఖ రాయబోతున్నామని ఆయన వెల్లడించారు. బిల్లులోని లోపాలను సవరించే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంటులో పెట్టి ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నామని యనమల చెప్పారు.