యు.పి.లో మరో గ్యాంగ్ రేప్

 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన జరిగింది. ఓ మహిళ మీద పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఓ దళిత కుటుంబం వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా పొదల్లో దాక్కొని ఉన్న పది మంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. ప్రతిఘటించిన ఆ మహిళ భర్త, కుమారుడిని చెట్టుకు కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వారిని మహిళ కుటుంబం గుర్తించింది. ఆ పది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలల్లో ఆమె అత్యాచారానికి గురైనట్లు వెల్లడయింది. నిందితుల కోసం గాలిస్తున్నారు.