కిడ్నాపైన భారతీయులు సేఫ్!

 

 

 

ఇరాక్‌లో భారతదేశానికి చెందిన 40 మంది కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఇరాక్‌లోని మెసూల్‌లో వున్న ఉర్ అల్ హూద్ కంపెనీలో పనిచేస్తున్న 40 మంది భవన నిర్మాణ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. కిడ్నాప్ అయినవారు పంజాబ్‌కి చెందిన చెందినవారు. కాగా, భవన నిర్మాణ కార్మికులు ప్రస్తుతం తీవ్రవాదుల అదుపులోనే వున్నారని, వారు ప్రస్తుతం సేఫ్‌గానే వున్నారని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. వీరిని కాపాడటానికి భారత ప్రభుత్వంతోపాటు ఇరాక్ ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది.