చిరంజీవి కుమార్తె సుస్మిత నివాసంలో 35కోట్లు స్వాధీనం
Published on: Mon May 14, 2012 5:48PM
సినీ నటుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుమార్తె సుస్మిత నివాసంలో సోదాల వివరాలను ఆదాయపన్ను వెల్లడించింది. చిరంజీవి సుస్మిత నివాసంలో అట్టపెట్టెల్లో ఉంచిన వెయ్యి, అయిదు వందల నోట్లతో కూడిన 35కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం వరకూ సోదాలు జరిపామని, తమ విచారణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు లెక్కలు చూపని సొమ్ముగా ఐటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.


