తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
Published on: Fri May 19, 2023 9:35AM
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న అంటే మే 18న మొత్తం 66280 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 36 వేల 905 మంది తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ఆదాయం 3.29 కెట్ల రూపాయలు. ఈ ఉదయం అంటే (మే19) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలా తోరణం వరకూ ఉంది.
టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం 30 గంటలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.


