తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Published on: Thu Jun 15, 2023 7:32AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెట్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
బుధవారం మొత్తం 78వేల 487 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 38వేల 213 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చింది.


