సిమెంట్ బస్తాల లారీలో నోట్ల కట్టలు

 

ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న కోటీ 90లక్షల నగదును కృష్ణా జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిమెంట్ బస్తాల లారీలో విజయవాడ నుంచి ఏలూరుకు భారీగా నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తాడిగడప రోడ్డులో పోలీసులు తనిఖీలు చేపట్టి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఎవరిది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.