ముంబైలో తొక్కిసలాట..18 మంది మృతి

 

 

 

దావూదీ బోహ్రా ఆధ్యాత్మిక గురువు సైద్నా మొహమ్మద్ బుర్హనుద్దీన్‌ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తమ ఆధ్యాత్మిక గురువును కడసారి చుసుకోనేందుకు ప్రజలు ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో శుక్రవారంనాడు దావూదీ బోహ్రా వర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సైద్నా మొహమ్మద్ బర్హుహిద్దీన్ మరణించారు. ఆయన వయస్సు 102 ఏళ్లు.