15 మంది పాకిస్థాన్ రేంజర్లు మృతి...
posted on Oct 28, 2016 2:01PM
జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 15 మంది సైనికులు మృతిచెందినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో తరచూ కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి భారత సైన్యం ధీటుగా సమాధానం చెబుతుంది. భారత జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 15 మంది సైనికులు మృతిచెందారని.. బీఎస్ఎఫ్ డైరక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు. భారత దళాలు జరిపిన దాడుల్లో పాక్ రేంజర్లు ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోయినా, కనీసం 15 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతిచెంది ఉంటారని ఆయన అన్నారు. మన సైనికులు ఎవరూ గాయపడలేదని బీఎస్ఎఫ్ పేర్కొంది. గత 24 గంటల నుంచి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. రాజౌరి, సాంబా, అబ్దులియా, ఆర్ ఎస్ పురా, సుచిత్గర్ ప్రాంతాల్లో ఏకథాటికి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.