కంగారూ కోర్టు శిక్ష: యువతిపై 12 మందితో రేప్

 

 

 

పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. పిటిఐ వార్తాకథనం ప్రకారం... పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో గిరిజన యువతి మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందని ఆరోపణతో..గ్రామ కంగారూ కోర్టు ఆమెకి రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఆ డబ్బు మొత్తం చెల్లించలేమని ఆమె కుటుంబం చెప్పడంతో... ఆ యువతిపై 12 మందితో సామూహిక అత్యాచారం జరిపించారు. ఈ సంఘటనపై గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...గ్రామానికి చెందిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.