జగన్ అక్రమాస్తులపై 11వ ఛార్జ్‌షీట్ దాఖలు

 

జగన్ అక్రమాస్తుల కేసులో పట్టు మరింత బిగుస్తోంది. ఈ కేసులో సీబీఐ 11వ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వైఎస్‌ జగన్‌ను ఏ1 నిందితుడిగా మరోచార్జిషీట్‌ దాఖలైంది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఒప్పందంతోనే ఇందు ప్రాజెక్ట్స్‌కు క్విట్‌ప్రోకో పద్దతిలో భూ కేటాయింపులు జరిపారని నిర్ధారిస్తూ సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. మొత్తం 14 మందిని నిందితులుగా సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది.