వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంప్.. బట్ కండీషన్స్ అప్లై!!
posted on Jun 17, 2019 5:27PM
ఏపీలో టీడీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీ లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ లిస్ట్ ఎవరనేది కూడా వైసీపీ అధినాయకత్వం దగ్గరకి చేరినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ మాత్రం పార్టీ ఫిరాయించాలంటే ఖచ్చితంగా స్పీకర్ పార్మెట్ లో రాజీనామా చేయాలనీ చెప్పాడు. దీనితో ఆలోచనలో పడిన టీడీపీ ఎమ్మెల్యేలు కొన్ని తర్జనలు,భర్జనలు పడిన తర్వాత రెండు ప్రధానమైన కండీషన్స్ జగన్ ముందు పెట్టినట్లు సమాచారం.
ఆ కండీషన్స్ ఏంటంటే.. "తాము రాజీనామా చేసి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా పోటీచేసే ఛాన్స్ తమకే ఇవ్వాలి, ఒకవేళ కుదరని పక్షంలో తమ కుటుంబసభ్యులకి ఇవ్వాలి. అలాగే.. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ తప్పకుండా తమ తరుపున నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి." వీటికి జగన్ నుండి హామీ లభిస్తే, వెంటనే రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నామని పార్టీ మారే ఆలోచనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది .మరి వాటికి జగన్ ఆమోదముద్ర వేస్తారో లేదో చూడాలి.