పది మంది నాతో టచ్ లో ఉన్నారు.. బాబుకు అవంతి బిగ్ షాక్ !!

 

 

ఏపీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలై కేవలం 23 స్దానాలను దక్కించుకుంది. అసలు ఈ ప్రజా తీర్పుకు కారణం ఏమిటో అర్ధం కావడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్కన మొత్తుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఎవరు ఎప్పుడు ఎటు జంపు చేస్తారో అని పార్టీ అధిష్టానం టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ రోజు మంత్రి అవంతి శ్రీనివాస్ మరో బాంబు పేల్చారు. తనతో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈ విషయం సీఎం జగన్ కు కూడా చెప్పానని అయన ఓకే అంటే టీడీపీ ఖాళీ అవడం ఖాయమని అంటున్నారు. ఎప్పటి నుండో  టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ తో టచ్ లో ఉన్నారు ఈ పార్టీతో టచ్ లో ఉన్నారు అంటూ పుకార్లు వస్తున్నా విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత మంత్రి అవంతి నోటి నుండి ఈ మాటలు రావడం టీడీపీ లో కలకలం రేపుతున్నాయి