చిత్రకూట్ ఆలయంలో తొక్కిసలాట.. 10 మంది మృతి

 

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ కంఠానాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. 30 మంది గాయపడ్డారు. సాత్నా జిల్లాలోని కంఠనాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలో రాక్షసులను సంహరించాడని అంటారు. అమావాస్య రోజున ఇక్కడ పూజలు జరిపితే మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం భక్తులకు వుంది. అయితే భక్తులు భారీగా రావడంతో ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. ఒక కొండ అంచు మీద కట్టిన గోడ కూలిపోవడంతో భక్తులు పై నుంచి పెద్ద గుంటలోకి పడిపోయినందువల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను తక్షణ ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.