10% బిల్లుకు రాజ్యసభలో కష్టాలు

 

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రతిపాదించిన బిల్లు నిన్న లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ బిల్లు ఈరోజు రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయన్నారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్’  నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. సామాజిక సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా ఈ బిల్లుపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబడుతున్నాయి. కొన్ని సవరణలు చేయాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగారు. సభ్యులు శాంతించకపోవడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బిల్లు ఆమోదం పొందింది. కానీ రాజ్యసభలో మాత్రం తిరస్కరణను ఎదుర్కొంటుంది.