జగన్ తో సహా వైకాపా సభ్యులు అందరూ సభ నుంచి సస్పెండ్
Published on: Fri Dec 18, 2015 10:25AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ రోజు కూడా కాల్ మనీ వ్యవహారంపై దద్దరిల్లింది. దానిపై చర్చకు వైకాపా గట్టిగా పట్టుబడుతూ సమావేశాలను అడ్డుకోవడంతో శాసనసభ వ్యహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆపార్టీ సభ్యులందరినీ సభలో డా. అంబేద్కర్ పై చర్చ ముగిసేవరకు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించగా దానిని స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు ఆమోదించారు.


