మహిళా ఇంజనీర్ సజీవ దహనం..

 

బీహార్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఇంజనీరింగ్ ను సజీవ దహనం చేశారు. వివరాల ప్రకారం... బీహార్లో సరితా దేవి అనే మహిళ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ ఆర్ఈజీఏ)లో ముజఫర్ నగర్ లోని మొరౌల్ బ్లాక్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే కొంత మంది దుండగలు అమెను తన ఇంట్లోనే కుర్చీలో తాళ్లతో కట్టేసి సజీవదహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు... విచారణ నిమిత్తం ఇంటి యజమాని విజయ్ గుప్తాను తమ కస్టడీలోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. కాగా కొన్నేళ్లుగా ఆమె తన భర్త నుంచి విడిగానే ఉంటోందని.. ఆమెకు ఇద్దరు సంతానమని తెలిపారు.