విజయనగరంలో తెలుగుదేశం విజయఢంకా

 

 

 

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది. జిల్లాలోని నాలుగు మునిసిపల్ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. బొబ్బిలి స్థానం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆధిక్యం లభించలేదు. విజయనగరంలోని 40 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీడీపీ 22 స్థానాల్లో విజయం సాధించగా, వైకాపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు ఒక స్థానాన్ని పొందారు. బొబ్బిలిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, తెలుగుదేశం 13 స్థానాల్లో గెలవగా, వైకాపా 15 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఛైర్మన్ అవుతాడో అర్థం కాని పరిస్థితి వుంది. పార్వతీపురంలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 14 స్థానాలు, వైకాపా 10 స్థానాలు పొందాయి. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. సాలూరులోని 29 స్థానాల్లో మూడు కాంగ్రెస్, పదిహేడు తెలుగుదేశం, వైకాపా తొమ్మది స్థానాల్లో గెలిచాయి.