ఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

 

కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్రబలగాలను ఉంచాలని కోరారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని.. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించాలని, అన్ని స్ట్రాంగ్ రూమ్ లలో 24 గంటలు సీసీ టీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సీఎం చంద్రబాబు నేరుగా సీఈవోకు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు బదులుగా కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.