వెంకయ్య నాయుడికి కోపం వచ్చింది.

 

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి కోపం వచ్చింది. అంతలా వెంకయ్యకు ఎవరు కోపం తెప్పించారబ్బా అని అనుకుంటున్నారా.. ఇంకెవరూ ఎయిర్ ఇండియా సంస్థ. ఎయిర్ ఇండియా కస్టమర్లను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది కేంద్రమంత్రులను కూడా ఇబ్బందికి గురి చేస్తుంది. వెంకయ్య నాయుడు నిన్న ఓ పని నిమిత్తం హైదరాబాద్ రావల్సి ఉండగా.. అందుకు ఆయన విమానం కోసం ఎయిర్ పోర్టులో గంట సేపు వెయిట్ చేశారు. అయితే ఎంత సేపటికి ఫ్లైట్ రాకపోవడంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ట్విట్టర్లో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ..తన ఆగ్రహాన్ని తెలిపారు. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు. విమానయాన సంస్ధల్లో ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు మంత్రి వెంకయ్య నాయుడు హితవుపలికారు. మరి ఎయిర్ ఇండియా వెంకయ్యకు సమాధానం చెబుతుందో లేదో చూడాలి.