వాయలర్ రవికి అల్పాహార విందు ఇచ్చినా చిరంజీవి
Published on: Wed Apr 18, 2012 11:40AM
హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రతినిధి వాయలర్ రవికి చిరంజీవి తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. విందు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన వయలార్ రవి ఉపఎన్నికల్లో విజయం సాధించగల సత్తా ఉన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలోనైనా భేదాభిప్రాయాలు సహజమేనని వాయలార్ అభిప్రాయపడ్డారు. వాయలార్ రవి గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చిరంజీవి ఇచ్చిన విందుకి పిసిసి బొత్స, పలువురు నాయకులు వచ్చారు.


