సోనియాకు అమెరికా కోర్టు సమన్లు
posted on Sep 5, 2013 12:24PM
కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది.1984లో సిక్కుల ఊచకోతలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల రక్షించడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని న్యూయార్క్లోని న్యాయస్థానం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. వైద్య పరీక్షల కోసం అమెరికా పర్యటనలో ఉన్న సోనియాగాంధీకి అక్కడి న్యాయస్థానం సమన్లు జారీ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని....నిస్సందేహంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. గతంలో కూడా న్యాయం కోసం ఆందోళన చేస్తున్న అమెరికాలో నివసిస్తున్న సిక్కు జాతీయులు ఆ దేశ చట్ట పరిధిలోకి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, కేంద్ర మంత్రి కమల్ నాథ్లపై ఇటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.