రాజీనామా బాటలో కేంద్ర మంత్రులు

 

 

 

కేంద్ర మంత్రులు రాజీనామా బాట పడ్తున్నారు. పదవుల్లో వుండి పార్టీకి సేవ చేయలేకపోతున్నామనే బాధతో వారంతా రాజీనామా చేస్తున్నారట. రాజీనామా బాటలో కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్‌, జైరాం రమేష్‌ సహా మరికొందరు వున్నట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీ బాగోగులపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రుల్ని పార్టీ కార్యక్రమాలకోసం వినియోగించుకునేందుకు వీలుగా వారితో రాజీనామాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.